అమరావతి : విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ విజయవాడ శివారులోని నిడమూరు వద్ద చోటు చేసుకున్నది. ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన పోతనపల్లి హరీశ్కుమార్ మృతి చెందారు. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని హరీశ్కుమార్ కారు ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన హరీశ్కుమార్తో పాటు మరో వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. బుధవారం విధుల్లో చేరేందుకు ఢిల్లీకి పయనమవుతుండగా.. దుర్ఘటన చోటు చేసుకున్నది. విధుల్లో చేరేందుకు వెళ్తూ హరీశ్ మృతి చెందడంతో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.