అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) అండ్ టీం పాల్పడుతున్న అవినీతి (Corruption) , అక్రమాలపై చర్చకు సిద్ధమా? ధైర్యముంటే చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సవాలు విసిరారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన శంఖారావం (Shankaravam) సభలో మాట్లాడారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు(Attack) చేయడం, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆరోపించారు. బాంబులకే భయపడని కుటుంబం మాదని చంద్రబాబు(Chandra Babu) పై అలిపిరి ఘటనను ప్రస్తావించారు. జగన్ను చూస్తే కోడికత్తి.. చంద్రబాబును చూస్తే కియా కారు గుర్తొస్తుందని పేర్కొన్నారు.
మా నమ్మకం నువ్వే జగన్ అంటూ బోర్డులు, ఫ్లెక్సీలు పెడుతున్నారని వాస్తవానికి జగన్ తల్లి, సోదరే ఆయనను నమ్మడం లేదని, ఇక ప్రజలేలా నమ్ముతారని ప్రశ్నించారు. ఏటా డీఎస్సీ, కానిస్టేబుళ్ల నియామకం అన్నారు. ఒక్కసారైనా ఐదేండ్లలో నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.