RTC Bus Fire Accidet | కడప జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి వద్ద పల్లె వెలుగు బస్సుకు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులోని 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
బస్సులో నుంచి మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. కాగా, అప్రోచ్ రోడ్డుకు మట్టి ఎక్కువగా వేయడంతో విద్యుత్ లైన్ బస్సుకు తాకి ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లె వద్ద విద్యుత్ వైర్లు తాకడంతో ఓ పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని 21 మంది ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే కిందికి దిగిపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.#FireAccident #AndhraPradesh #Bus pic.twitter.com/sPmpEvQkqt
— Journalist Scoop (@journalistscoop) April 5, 2026