హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఏపీఎస్ఆర్టీసీ ఈయూ (ఎంప్లాయీస్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షుడు వైవీరావు గుండెపోటుతో మృతిచెందారు. గొల్లపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వైవీ రావు మృతికి సీఎం వైఎస్ జగన్సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.