అమరావతి : ఏపీకి చెందిన క్రికెటర్ హనుమ విహారి(Hanuma Vihari) కి ఏపీకి చెందిన ప్రతిపక్ష నాయకులు సంఘీభావం పలికారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విహారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చంద్రబాబు(Chandra babu) మాట్లాడుతూ వైసీపీ రాజకీయా కక్షలకు లొంగిపోవడం సిగ్గుచేటని ఆంధ్ర క్రికెట్అసోసియేషన్ (Andhra Cricket Association) పై మండిపడ్డారు. ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహారిని వేధించారని, అతడికి న్యాయం జరిగేలా చూస్తామని, అతడి చిత్తశుద్ధిని వైసీపీ కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవని అన్నారు.
భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా అంటూ పవన్కల్యాణ్ (Pawan Kalyan) ట్వీట్ చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియోషన్ తీరుకు చింతిస్తున్నానని అన్నారు. గాయాలైన ఏపీ రంజీ జట్టు కోసం హనుమ విహారి ఆడాడని, రంజీ జట్టు నాకౌట్ చేరడంలో అతడు కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. వైసీపీ నేత వల్లే కెప్టెన్సీకి రాజీనామా చేశారని వివరించారు. షర్మీల (Sharmila) మాట్లాడుతూ వైసీపీ క్రీడలపై కూడా దౌర్బాగ్య రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఇంతకంటే సిగ్టుచేటు విషయం ఇంకేముంటుందని అన్నారు.
అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్నారని , రాష్ట్ర ప్రతిష్టను అన్నివిధాలా నాశనం చేశారని దుయ్యబట్టారు. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేశారని ఆమె విరుచుకుపడ్డారు. ఆటగాళ్ల భవిష్యత్ను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషనా? అధ్వానపు క్రికెట్ అసోసియేషనా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.