AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్లో పాముల సంచారం కలకలం రేపింది. టికెట్ కౌంటర్, పార్సిల్ కార్యాలయం, ప్లాట్ఫామ్పై ప్రయాణికులు వేచి ఉండే గదిలో పాములు సంచరిస్తున్నాయి. దాంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో సమీపంలోని తుప్పలు, చెట్ల వద్ద ఉన్న పుట్టల్లోంచి పాములు బయటకు వస్తున్నాయి.
రైల్వేస్టేషన్లోకి వచ్చిన పాములను చూసి ప్రయాణికులు కేకలు వేయడంతో సిబ్బంది కొన్నింటిని పట్టుకున్నారు. స్టేషన్ ప్రాంగణంలో పాత భవనాలు, దశాబ్దాల నాటి అనేక చెట్లు ఉన్నాయని, వాటిలో పాములు స్థావరం ఏర్పాటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. కాగా విషసర్పాలు రైల్వేస్టేషన్ లోపలికి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.