అమరావతి : ఏపీలోని కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది . జిల్లాలోని రావులపాలెం గౌతమి గోదావరి వంతెన వద్ద మహిళను ఆమె ఇద్దరు పిల్లలను ఓ నిందితుడు నదిలోకి తోసేసి కారులో పారిపోయాడు. ఈ ఘటనలో తల్లి, ఏడాది చిన్నారి గల్లంతు కాగా 13 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. గల్లంతైన మహిళ స్వస్థలం తాడేపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనకు పాల్పడింది గుడివాడ వాసి ఉలవ సురేష్ అని, అక్రమ సంబంధమే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాల కోసం నదిలోకి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.