అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతే ఉంటుందని, ఇందులో అనుమానం లేదని సినీనటుడు శివాజీ అన్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా గురువారం వర్షాల కారణంగా విరామం తీసుకుంటున్న రైతుల శిబిరం వద్దకు వెళ్లిన శివాజీ రైతులకు సంఘీభావం ప్రకటించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కులాల ప్రాధాన్యత ప్రకారమే రాజకీయాలు కొనసాగుతుండడం విచారకరమని పేర్కొన్నారు.
గతంలో ఐదేండ్లు పాలించిన ఒక పార్టీ చేసిన అభివృద్ధిని మరో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధిని ఆటంక పరచడం అలవాటుగా మారిందని తెలిపారు . సమాజంలో తామే శాశ్వతమని విర్రవీగె నాయకులకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని తెలిపారు.