అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నాని కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఎన్టీఆర్ అభిమానులుగా వారి తరపున మరోసారి సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.ఈసందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీని రాజకీయ సమాధి చేసినట్టుగా ఏపీలో కూడా పార్టీని రాజకీయ సమాధి చేస్తారని,అలాంటి పరిస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారని కొడాలి నాని ఆరోపించారు. జిల్లా మార్పుల్లో సలహాలు ఇస్తే తీసుకోవడానికి జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.