అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా రెండు రూపాయలు సర్ ఛార్జ్ పేరుతో 10వేల కోట్లు లూటీ చేశారని కొడాలి నాని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చినా బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మోసం తెలుసుకున్న ప్రజలు 2019 ఎన్నికల్లో పెట్రోల్ పోసి తగలబెట్టారని మండిపడ్డారు. పెట్రోల్ ధరలు తగ్గించాల్సింది కేంద్రం అని 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా అని కొడాలి నాని ప్రశ్నించారు.