అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజవర్గంలో రీపోలింగ్ జరపాలని మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు (AP High Court) కొట్టివేసింది . 236, 237, 253, 254 వార్డుల్లో టీడీపీ శ్రేణులు పోలింగ్ బూత్లను ఆక్రమించి రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ అంబటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బూత్లల్లో రీపోలింగ్ (Repolling) జరుపాలని పిటిషన్ వేశారు. పిటిషన్పై గురువారం సాయంత్రం విచారణ చేపట్టిన కోర్టు అంబటి పిటిషన్ను డిస్మిస్ చేసింది. అదేవిధంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా రీపోలింగ్ జరపాలని వైసీపీ అభ్యర్థి మోహిత్రెడ్డి వేసిన పిటిషన్ను సైతం కొట్టి వేసింది .