తిరుపతి : ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇవాళ ఉదయం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి సీజేకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం లడ్డూ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు.
కాగా తిరుమలలో నిన్న శ్రీవారిని 76,425 మంది భక్తులు దర్శించుకోగా 36,053 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.15 ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం 27 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి 8 గంటలో దర్శనం కానున్నదని వివరించారు.