అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) ముందస్తు బెయిల్ పిటీషన్పై విచారణను ఏపీ హైకోర్టు( AP High Court ) రేపటికి వాయిదా వేసింది. సీఐడీ అధికారుల అభ్యర్థన మేరకు కేసును రేపటికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం కేసులో అనేక అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీ(AP CID) అధికారులు చంద్రబాబుపై కేసులు నమోదు చేశారు. ఐఆర్ఆర్ వ్యవహారంలో క్విడ్ ఫ్రోకో(Quid Froco) జరిగిందని న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయని ఏజీ శ్రీరామ్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ముందుస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.