అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) శనివారం మీడియాతో మాట్లాడుతూ నోటిఫికేషన్ గురించి వివరించారు.
సంక్రాంతి పండుగ తరువాత మెగా డీఎస్సీ (Mega DSC ) నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఏయే జిల్లాలో ఖాళీలు, వాటి భర్తీకి సంబంధించిన విధివిధానాలతో కూడిన వివరాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.