AP News | తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. టూరిజం ఎండీగా ఆమ్రపాలిని నియమించింది. అలాగే టూరిజం అథారిటీ సీఈవోగా ఆమెకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది.
ఇక కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్ను ఏపీ ప్రభుత్వం నియమించింది. దీంతో కార్మిక శాఖ అదనపు బాధ్యతల నుంచిఎం.ఎం.నాయక్ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వైద్యారోగ్య శాఖ కమిషనర్గా వాకాటి కరుణను నియమించింది. అలాగే జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ జి.వాణీమోహన్ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీ ముఖ్యకార్యదర్శిగానూ వాణీమోహన్కు బాధ్యతలు ఇచ్చింది. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న పోల భాస్కర్ను రిలీవ్ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. ఇక తెలంగాణ నుంచి ఏపీ కేడర్కు వెళ్లిన రోనాల్డ్ రోస్కు ఇంకా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.