అమరావతి : ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం కోసం జగన్ సర్కారు విరాళాలు సేకరణపై దృష్టి పెట్టింది. రూ.6321 కోట్లు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పులకు అవకాశం లేకపోవడంతో విరాళాల సేకరణపై ఫోకస్ చేసింది. అంతర్జాతీయ దాతృత్వ సంస్థల నుంచి విరాళాలు సేకరించాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48,626 గదులను అదనంగా నిర్మించనున్నారు.