AP News | ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సర్వీసును పొడిగించారు. ఆయన పదవీకాలం ఈ నెలఖారుతో ముగియనుండగా.. మరో మూడు నెలల పాటు పొడిగించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీంతో 2026 ఫిబ్రవరి వరకు సీఎస్గా కొనసాగనున్నారు.
విజయానంద్ తర్వాత స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్కు సీఎస్గా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. 2026 మే నెలతో సాయిప్రసాద్ పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత కూడా సీఎస్గా ఆయన్నే ప్రభుత్వం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరువురు అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి సమాచారం అందించినట్లు తెలుస్తోంది.