అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యోగుల చేతుల్లోనే బంతి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కొత్త పీఆర్సీ అమలులో ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని తాము చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.జీవోలో మార్పులు కోరితే చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే ప్రభుత్వం నుంచి విడుదలైన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరడం సమంజసం కాదని అన్నారు.
కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి తగ్గినా మెరుగైన ఐఆర్ను ఇచ్చామని అన్నారు. ఉద్యోగుల ఆందోళనల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. చలో విజయవాడకు కొవిడ్ ఉన్నందున అనుమతి ఇవ్వలేదని ఇందులో ఎలాంటి అనుమానాలు లేదని అన్నారు. ఈరోజు లక్షలాధి సంఖ్యలో ఉద్యోగులు చలో విజయవాడకు హాజరు కావడంపై బొత్స స్పందిస్తూ ఈ విషయంలో ప్రభుత్వం వ్యతిరేకంగాను, అనుకూలంగాను ఆలోచించడడం లేదని అన్నారు.