YS Jagan | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలో గెలుపొందాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ నేపథ్యంలో గురువారం కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. 175 స్థానాల్లో విజయం దిశగా కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే మొదటి అడుగు పడాలని చెప్పారు. 2024 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా భరత్ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామి హామీ ఇచ్చారు.
కుప్పం తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం వంటిదని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.65 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రెండు రోజుల్లో జీవో విడుదలవుతుందని చెప్పారు. కుప్పం పరిధిలో ఇతర సమస్యలేం ఉన్నా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కుప్పం అసెంబ్లీ పరిధిలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు వైఎస్ జగన్ హితబోధ చేశారు. గత మూడేండ్లుగా కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో అత్యధిక మేలు జరిగిందని అన్నారు.