అమరావతి : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం రాజ్భవన్లో కలిశారు. ఈ సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్ల ఆమోదంపై గవర్నర్తో సీఎం జగన్ ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. గవర్నర్ కోటాలో రాష్ట్రంలో నాలుగు ఎమ్మెల్పీ స్థానాలు శుక్రవారం ఖాళీకానున్న విషయం తెలిసిందే. అయితే ఈ నాలుగు స్థానాలకు పశ్చిమగోదావరి జిల్లా నుంచి మోషేను రాజు, గుంటూరు జిల్లా నుంచి లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లా నుంచి ఆర్వీ రమేష్ యాదవ్, తూర్పుగోదావరి జిల్లా నుంచి తోట త్రిమూర్తులు పేర్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసి రెండు రోజుల క్రితమే గవర్నర్కు పంపారు. కానీ గవర్నర్ ఇంకా వాటికి ఆమోద ముద్ర వేయలేదు. ఈ నలుగురిలో ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలా.? వద్దా అనే విషయంపై గవర్నర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.