అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ తో ఆయన భేటీ కానున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ లభించడంతో రేపు ఉదయం తాడెపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలు దేరి గన్నవరం విమానశ్రయంకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఏపీకి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, బకాయిల విడుదలపై పీఎంతో జగన్ సమావేశం కానున్నారు.