Chandra Babu | తమిళ సినీ దర్శక దిగ్గజం భారతీరాజా( Bharathiraja ) మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధాకరమని అన్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చిరస్మరణీయ చిత్రాలు అందించారని కొనియాడారు.
భారతీయ సినీ రంగానికి ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. భారతీ రాజా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారతీరాజా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీ రాజా (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారతీరాజా మరణ వార్తతో తమిళ సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 2025 మార్చిలో భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీ రాజా కేవలం 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో అకాల మరణం చెందారు.