Sarlankapalle | కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్నిప్రమాద బాధితులకు అన్ని విధాలుగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలనాన్నారు. కాగా, తక్షణసాయంగా ఒక్కో కుటుంబానికి రూ.25వేలు నగదు అందజేస్తున్నామని అధికారులు తెలిపారు.
సంక్రాంతి పండుగ వేళ సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాదంపై మంగళవారం నాడు మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పండుగ సమయంలో ఈ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమీక్ష సందర్భంగా బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని హోంమంత్రి అనిత, ఇతర అధికారులు చంద్రబాబుకు వివరించారు. తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.25వేల గనదు అందజేస్తున్నామని తెలిపారు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అప్పటివరకు వారికి అవసరమైన వసతి, ఇతరసాయం అందజేయాలని సూచించారు.
ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అందే సాయంపై మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని సూచించారు.