హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అంకెల గారడీ, మాటల మాయాజాలం మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అంతా డొల్లతనమేనని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించారు తప్ప రాష్ట్ర గతి, ప్రగతిని ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. స్పష్టమైన అభివృద్ధి నమూనాను ఆవిషరిస్తారని ఆశించినవారిని బడ్జెట్ నిరుత్సాహపరిచిందని దుయ్యబట్టారు.
అప్పులు తెచ్చి నడిపే పథకాలు తప్ప ఆదాయ సృష్టి జరగలేదని విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత కీలకమైన రంగాలను టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. కాపు నేస్తానికి రూ.550 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.4,887 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం 2019 నుంచి కాపుల కోసం ఏమి చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.