ఏపీలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కామెంట్స్పై, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్య త్యాగం గురించి కొందరు మాట్లాడుతున్నారని, వారి త్యాగాలను చాలా సార్లు గమనించామని కౌంటర్ ఇచ్చారు. ఇక ఆ త్యాగాలను గమనించడానికి ఏపీ బీజేపీ ఏమాత్రం సంసిద్ధంగా లేదని సోము వీర్రాజు తేల్చి చెప్పారు.
విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇతరత్రా విషయాలు మాట్లాడుతూనే సోము వీర్రాజు పొత్తుల విషయాన్ని మధ్యలో ఉటంకించారు. అభివృద్ధి, సంక్షేమం అన్న ప్రధాన అస్త్రాలు తమ వద్ద ఉన్నాయని, ఆ త్యాగాలను భరించడానికి తాము సిద్ధంగా లేమని, ఆ త్యాగధనులంతా ఈ విషయాన్ని తెలుసుకోవాలని సోము వీర్రాజు చురకలంటించారు.