TTD | తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు 6 గంటలకు సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుడి ఉత్సవమూర్తుల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఆ తర్వాత ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. తొలిరోజు సీతారామలక్ష్మణులు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.