Protest: వేతనాలు పెంచాలని గత కొన్నాళ్లుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సీఐటీయూ (CITU) కార్యకర్తలతో కలిసి విస్సన్నపేట జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు వారి ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయినా వినిపించుకోకపోవడంతో అరెస్టుకు ప్రయత్నించారు. దాంతో అంగన్వాడీ కార్యకర్తలు పోలీసులపై తిరగబడ్డారు. మహిళా కానిస్టేబుళ్లను బలవంతంగా లాగి తమతో కూర్చోబెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
పోలీసులపై తిరగబడిన అంగన్వాడీలు…
ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ విస్సన్నపేట జాతీయ రహదారిపై సీఐటీయూ కార్యకర్తలతో కలిసి అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయింఛీ ఆందోళన చేపట్టారు.
కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా.. మహిళా కానిస్టేబుళ్ల పై అంగన్వాడీ కార్య కర్తలు తిరగబడ్డారు. pic.twitter.com/f1ELpQXalc
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2024
కాగా, తమ వేతనాలను 28 వేలకు పెంచాలంటూ అంగన్వాడీలు గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. దాంతో అంత వేతనం పెంచడం సాధ్యం కాదని ప్రభుత్వం తెగేసి చెబుతోంది.