కర్నూలు : ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీలోని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో కర్నూలులోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకులు తిక్కన్న, అంగన్వాడీ వర్కర్లు మండల నాయకురాలు జయమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ర్యాలీగా తరలివచ్చి నిరసన బైఠాయింపులో పాల్గొన్నారు.
చాలీ చాలని జీతాలతో కుటుంబ సభ్యులను పోషించుకోలేక తాము దుర్భర జీవనం గడుపుతున్నామని అంగన్వాడీలు విచారం వ్యక్తం చేశారు. తమకు ఇతర ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గర్భిణులు, బాలింతల పౌష్టికాహారం బిల్లులను వెంటనే విడుదల చేయాలని, గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్న బియ్యం, పప్పులు, నూనె తదితరాలను ప్రభుత్వం పెంచాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సిలిండర్లు మంజూరు చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు గ్యాస్ స్టవ్లు, పాత్రలు సరఫరా చేయాలని అంగన్వాడీ ఉద్యోగుల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకుంటే అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, హెల్పర్లతో పెద్దఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేపడగామని వారు తెలిపారు. నిరసన అనంతరం నాయకులు మండల ఉప తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు.