అమరావతి : తన భర్త రఘురామకృష్ణరాజుకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్, సీఐడీయే బాధ్యత వహించాలని ఆయన భార్య రమ అన్నారు. ఈ రాత్రి జైలులో రఘురామపై దాడి చేస్తారనే సమాచారం ఉందని ఆమె తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని రమ పేర్కొన్నారు.
మొన్న రాత్రి విచారణ పేరుతో సీఐడీ కార్యాలయంలో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. కోర్టు చెప్పినా వినకుండా రఘురామను జైలుకు తరలించడం దారుణమని అన్నారు. జైలు నుంచి వెంటనే రఘురామను వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు పంపాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం రఘురామపై కక్షసాధింపులకు దిగుతుందని మండిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.