అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నీంటిని జాబ్ క్యాలెండర్లో చేర్చాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఈ నెల 20వ తేదీన జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల వేళ లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామన్న జగన్ హామీని నమ్మి యువత మోసపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని అన్నారు.