అమరావతి : కరోనా మహమ్మారి విజృంభన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,399 మంది కొవిడ్-19 బారిన పడగా 89 మంది మరణించారు. కాగా 18,638 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. నూతన కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసులు 13,66,785కు చేరుకున్నాయి. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,01,042గా ఉంది.
జిల్లాల వారీగా కొవిడ్ మరణాలు ఈ విధంగా ఉన్నాయి. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో 11 మంది, చిత్తూరు, తూర్పుగోదావరిలో 9 మంది, కృష్ణ, ప్రకాశంలో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఐదుగురు, కడప, కర్నూలు, పశ్చిమ గోదావరిలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు చొప్పున మృత్యువాతపడ్డారు.