అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 98,048 శాంపిల్స్ పరీక్షించగా 12,768 మందికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల మరో 98 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజు వ్యవధిలో 15,612 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1717156కు చేరింది. ప్రస్తుతం 143795 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 11132కు పెరిగింది.