హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజావిశ్వాసం కోల్పోయారని బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో గురువారం ఏపీ నుంచి వచ్చిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో అటు దేశంలో, ఇటు ఏపీలో మార్పులొస్తాయనే విశ్వాసంతో ప్రజలున్నారని తెలిపారు.
రోజురోజుకూ ఏపీలో బీఆర్ఎస్ బలపడుతున్నదని చెప్పారు. తెలంగాణ మాడల్ దేశానికి దిక్సూచిగా మారిందని తెలిపారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించే వరకు బీఆర్ఎస్ విశ్రమించబోదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన చిప్పాడ శేషగిరిరావు, విజయవాడ నుంచి వచ్చిన పెండ్యాల రవీందర్, విక్రమ్కుమార్, మహేశ్ధీర, అనిల్సింగ్ తదితరులకు తోట చంద్రశేఖర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.