హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల (Inter Results) కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను అధికారులు ఒకేసారి విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఫలితాలను ప్రకటిస్తారు. మార్చి 1 నుంచి 20 వరకు ఏపీలో ఇంటర్ పరీక్షలను నిర్వహించారు. పరీక్షలు ముగిసిన 22 రోజుల వ్యవధిలోనే ఫలితాలను విడుదల చేస్తున్నారు.
ప్రథమ సంవత్సరానికి సంబంధించి 5,17,617, ద్వితీయ సంవత్సరం 5,35,056 మంది పరీక్ష ఫీజు చెల్లించగా.. వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను ఇంటర్బోర్డ్ అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.in లో చూడవచ్చు.