Biswabhushan Harichandan | ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ హరిచందన్ పరిస్థితి క్రిటికల్గా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన కుమారుడు, ఒడిశా రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు.
ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. 2004 నుంచి 2009 మధ్య న్యాయ, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 నుంచి 2023 వరకు బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీకి గవర్నర్గా సేవలు అందించారు. 2023 ఫిబ్రవరి 23న ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులయ్యారు.
బిశ్వభూషణ్ హరిచందన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గడిచిన 5 నెలల్లో ఆయన ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. అస్వస్థత కారణంగా గత ఏడాది సెప్టెంబర్లో ఆయన భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.