అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైంది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు జిల్లాలోని వనజాంగి వద్ద కొండపైన అదుపుతప్పి లోయలో పడింది. బస్సు విశాఖపట్నం నుంచి పాడేరుకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బస్సులో చిక్కుకున్న వారిని వెలికితీశారు. ఇంతలో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు చికిత్స కొనసాగుతున్నది.