Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు లక్ష మజ్జిగ ప్యాకెట్లను విరాళంగా అందించారు. అనంతపురం పట్టణానికి చెందిన గాయత్రి మిల్క్ డైరీ నిర్వాహకులు ఈ లక్ష మజ్జిగ ప్యాకెట్లను ఆలయ ఈవో పెద్దిరాజుకు అందజేశారు.
ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం ఈ విరాళం అందజేశామని తెలిపారు. ఈ మజ్జిగ ప్యాకెట్ల విలువ సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు.