అమరావతి : కరోనాకు మందును పంపిణీ చేసిన ఆనందయ్య ఒమిక్రాన్ కు కూడా మందు ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఆయుష్ శాఖ అనుమతిని నిరాకరించింది. గుర్తింపు లేని వ్యక్తులు అందించే మందులను ఆయుర్వేద మెడిసిన్గా భావించొద్దని స్పష్టం చేసింది. ఆర్సెనిక్ ఆల్బమ్, ఆయుష్-64 మాత్రమే ఆయుష్-64 మాత్రమే ఆయుష్ ప్రతిపాదిత మందులని ఏపీ ఆయుష్ శాఖ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఒమిక్రాన్ను నివారించే.. ఏ ఆయుర్వేద మందు ఉచిత సరఫరాకు , అమ్మకానికి గానీ తమ శాఖను సంప్రదించలేదని వెల్లడించింది. ప్రజలు నష్టపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మాస్కుల ధరించడం, భౌతిక దూరం పాటించడంతో కరోనా నుంచి రక్షణ పొందవచ్చని ఏపీ ఆయుష్ శాఖ వివరించింది.