అమరావతి : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్ర ఈనెల 17న తిరుపతిలో ముగియనున్నది. అమరావతి నుంచి ప్రారంభమైన యాత్ర పలు జిల్లాలో కొనసాగుతూ తిరుపతికి చేరనున్నది. ఈ సందర్భంగా అదేరోజు తిరుపతిలో భారీ బహిరంగ సభ్యను నిర్వహిస్తామని ఐక్యకార్యచరణ సమితి నాయకులు వెల్లడించారు. ఈ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శనివారం జిల్లా ఎస్పీకి ఎన్వోసీని అందజేశారు. బహిరంగ సభను రేణిగుంటలో ప్రైవేట్ స్థలాన్ని ఎంపిక చేశామని వివరించారు.
సభకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరుకావాలని ఆహ్వానాలు పంపుతున్నట్లు ఉద్యమ నాయకులు వెల్లడించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ తో పాటు మరికొందరు ముఖ్య నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. కాగా శనివారం పాదయాత్ర 34వ రోజు నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది .