అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర ఆదివారం 42వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం మొండివైఖరిని వీడాలని, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
తమ ఆందోళన ఒక్కరి కోసం కాదని ఐదు కోట్ల ఆంధ్రుల కోసమని అన్నారు . అమరావతిని రాజధానిగా కొనసాగించేలా సీఎం జగన్కు మంచి మనస్సు ఇవ్వాలని తిరుమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు పాదయాత్రను నిర్వహిస్తున్నామని మహిళా రైతులు పేర్కొన్నారు. దారిపోడవునా తమకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ తమకు సంతోశం కలిగిస్తుందని అన్నారు. చిత్తూరు జిల్లాకు చేరుకోనున్న అమరావతి రైతుల పాదయాత్రకు ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు మద్దతు తెలిపారు.