తిరుపతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ఏపీ సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరిని టీటీడీ అధికారులు శేషావస్త్రాలతో సన్మానించారు. రేపు(ఆదివారం) తిరుపతిలో ఏర్పాటు చేసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది.
ఈ సమావేశానికి అమిత్షా అధ్యక్షత వహించనున్నారు. దక్షిణాధి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ముఖ్యఅధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.