Ambati Rayudu | ఏపీ రాజకీయాల్లో (Ap Politics) అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే అధికార వైసీపీని వీడిన క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో అంబటి రాయుడు నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan)తో భేటీ అయ్యారు. కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇటీవలే అధికార వైసీపీకి క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలోకి చేరిన ఎనిమిది రోజులకే వైసీపీని వీడాడు. కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. ఇంతలోనే అనూహ్యంగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పవన్తో రాయుడి భేటీ హాట్టాపిక్గా మారింది.
ఇదిలా ఉండగా.. ఇటీవలే తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఈరోజు మధ్యాహ్నం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. సీఎంతో భేటీ తర్వాత ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read..
Heart Attack | క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. పిచ్ మధ్యలో కుప్పకూలి టెకీ మృతి
Uttar Pradesh | రాత్రి ఇంట్లో నిద్రపోయిన చిన్నారులు.. తెల్లారేసరికి విగతజీవులుగా మారారు
Corona virus | కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో 605 మందికి పాజిటివ్