Ambati Rambabu | టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. `గతంలో ప్రధాని మోదీని చంద్రబాబు టెరర్రిస్ట్ అని అన్నారు. ఇప్పుడు వెళ్లి మళ్లీ ఆయనే మోదీ కాళ్లు పట్టుకున్నాడు’ అని ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు ఇది టీడీపీ అధినేత చంద్రబాబు నైజం అర్థమైందా ? అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల సారధ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్నది.