అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శుల పర్యవేక్షణలో కొనసాగుతున్న శాఖల్లో భారీ మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి జీఏడీ, హోమ్, రెవెన్యూ, అటవీ పర్యావరణ బాధ్యతలతో పాటు అదనంగా కేంద్ర ప్రభుత్వ అంశాల బాధ్యతలను అప్పగించారు.
అదేవిధంగా సీఎం కార్యదర్శిగా పనిచేస్తున్న సాల్మన్ ఆరోఖ్యరాజ్కు పౌర సరఫరాలు, విద్య, పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి, గనులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, సంక్షేమ శాఖలు కేటాయించారు. మరో కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి ఆర్థిక, ప్రణాళిక, నీటిపారుదల, సాగు, అనుబంధ రంగాలు, మున్సిపల్ పరిపాలన, ఇంధన, పర్యాటకం, యువజన సర్వీసులు, మార్కెటింగ్, సహకార శాఖలను అప్పగించారు.
సీఎం అదనపు కార్యదర్శిగా కొనసాగుతున్న ముత్యాలరాజుకు రెవెన్యూ బాధ్యతలను కేటాయించారు.