అమరావతి : ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వా్నిదేనని , పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటేస్తే పథకాలన్నీ రద్దు అవుతాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ ( CM Jagan ) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ( Chandra Babu) సాధ్యం కాని హామీలిస్తున్నాడని విమర్శించారు.
రాష్ట్రాన్ని దోచుకునేందుకు కూటమిగా ఏర్పడ్డారని ఆరోపించారు. 2014లో కూటమి తరఫున పోటీ చేసి ఇచ్చిన రుణమాఫీ, పొదుపు సంఘాల రుణమాఫీ, అర్హులైన వారికి మూడుసెంట్ల స్థలం ఇవ్వలేదని, సింగాపూర్కు మించి నగరాలను నిర్మించలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకున్నారని దుయ్యబట్టారు. పెళ్లిళ్ల పేరిట వివాహవ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు. జ్వరం వచ్చినా హైదరాబాద్కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటూ పిఠాపురాన్ని అవమానపరుస్తున్నాడని పేర్కొన్నారు. బాబు ప్రయోజనం కోసం సొంత పార్టీ అభ్యర్థులను సైతం మార్చివేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం వైసీపీని గెలిపించాలని కోరారు.