అమరావతి : గుంటూర్ మిర్చి యార్డుకు రేపు సెలవు ప్రకటిస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మిర్చి బస్తాలతో మార్కెట్ యార్డు పూర్తిగా నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మంగళవారం యార్డుకు 2 లక్షలకుపైగా మిర్చి టిక్కీలు వచ్చాయి. ఇవాళ మరో లక్షన్నకుపైగా మిరప బస్తాలను రైతులు తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు.
యార్డు పూర్తిగా మిర్చిబస్తాలతో నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పేరుకుపోయిన సరుకును విక్రయిస్తేనే మార్కెట్కు కొత్తగా రైతులు సరుకు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది.
దీంతో గురువారం రైతులెవ్వరూ మార్కెట్ యార్డుకు సరుకు తీసుకురావొద్దని అధికారులు సూచించారు. విషయాన్ని గుర్తించి రైతులు సహకరించాలని అభ్యర్థించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి