అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(CM Jagan) పై గులకరాయి దాడి కేసులో నిందితుడు సతీష్కు బెయిల్ మంజూరయ్యింది . ఈ సందర్భంగా విజయవాడ కోర్టు (Vijayawada Court) సతీష్కు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. శని, ఆదివారాలు పీఎస్లో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. రూ. 50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల(Elections) సందర్భంగా సీఎం జగన్ విజయవాడలో బస్సుయాత్ర(Bus Yatra) నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సుపై నిలబడి మాట్లాడుతుండగా సీఎంపై గులకరాయితో దాడి చేశారు.ఈ దాడిలో జగన్కు నుదుటిపై గాయమై రక్తస్రావమైంది. పక్కనే ఉన్న మరో మంత్రికి సైతం గాయాలయ్యాయి. ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు సతీష్ అనే నిందితుడిని అరెస్టు చేసి నెల్లూరు జైల్లో (Nellore Jail) ఉంచారు.
ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు పలుమార్లు పిటిషన్ దాఖలు చేసుకోగా విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.