అమరావతి : బాపట్ల జిల్లాలో ఇటీవల వాలంటీర్ను దారుణంగా హత్య చేసిన నిందితుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 15న జిల్లా వేమూరు మండలం చావలిలో వాలంటీర్ శారదను పద్మారావు(35) అనే యువకుడు హత్య చేసి పారిపోయాడు. ఇవాళ నిందితుడు నిడుబ్రోలు రైలు స్టేషన్లో తెల్లవారుజామున మూడు గంటలకు తిరుపతి -విశాఖ డబుల్ డెక్కర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.