అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎమ్మెల్యేకు తృటిలో ప్రమాదం తప్పింది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vamsi) ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. శనివారం విజయవాడ నుంచి హైదరాబాద్ (Hyderabad) కు వస్తుండగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద కాన్వాయ్లోని వాహనాలు (Convoy) ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. దీంతో ఒక వాహనంలో ఉన్న ఎమ్మెల్యే వాహనం కూడా ప్రమాదానికి గురైంది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వైసీపీ నాయకులు ( Ycp Leaders) ఎమ్మెల్యేకు ఫోన్ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.