తిరుమల : తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు మబ్బు గోపాల్ రెడ్డి (77) రోడ్డు ప్రమాదంలో మృతి చెందా రు. బ్రహ్మోత్సవాల కవరేజ్ పూర్తి చేసుకుని వెళ్తుండగా తిరుపతి మొదటి ఘాట్ రోడ్డులో వేగంగా దూసు కొచ్చిన వాహనం వచ్చి ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సందర్భంగా జర్నలిస్టు మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు .
గోపాల్ రెడ్డి 40 సంవత్సరాలుగా జర్నలిస్టుగా విశేష సేవలు అందించారని కొనియాడారు . టీటీడీ తరపున గోపాల్ రెడ్డి కుటుంబానికి తగిన సహకారం అందిస్తామని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని చైర్మన్ ప్రార్థిం చారు విలువలతో కూడిన ఓ మంచి జర్నలిస్టును కోల్పోయామని వారు పేర్కొన్నారు. జర్నలిస్టు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు.